తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను...

read more

నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్

హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ...

read more

‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

వరుస ఫ్లాప్‌లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్...

read more
NRI

అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి…

ప్రతిష్టాత్మక మేగజైన్ ఫోర్బ్స్‌లో ఆంధ్రా అమ్మాయి మెరిసింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్‌ అండర్ -30 శాస్త్రవేత్త విభాగంలో ఆమెకు చోటుదక్కింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నవంబరు నెలలో ప్రచురించిన ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆమె ఈ ఘనతను సాధించింది. గత...

read more

“టీఆర్‌ఎస్ మిషన్” పేరుతో ఎన్నికల ప్రచార కార్యాలయం

తెలంగాణ రాష్ట్రం‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ విభాగం వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం "టీఆర్‌ఎస్ మిషన్" పేరుతో లండన్‌లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్...

read more

కేసీఆర్‌ ఫ్రంట్‌లో ప్రకాశ్‌రాజ్‌!

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక భూమిక పోషించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన...

read more

9 వందల ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..

ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల...

read more

మోదీని ప్రధాని చేస్తే..

బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన సంగతి తెలిసిందే....

40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ...

లక్ష్మణ్‌ అరెస్ట్‌..

తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు...

నాలుగో దఫా పోలింగ్‌: 50 శాతానికి చేరుకున్న పోలింగ్‌

ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్‌ ఆరోపించింది. జైపూర్‌ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్‌ ఎన్నికల...

ధనాధన్‌ ధోని.. రికార్డులు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్‌...

పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని...

రాహుల్‌ చెప్తే మోదీపై పోటీ

పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే వారణాసిలో లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. రాహుల్‌ పోటీచేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అసమ్మతి గొంతుక...

‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారుడే దొంగ) అని పేర్కొనడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులే నిదర్శమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు...

భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్‌ పర్వదినాన జరిగిన...

కొలంబోలో 87 బాంబులు లభ్యం

వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా...

రేపే రెండో విడత పోలింగ్‌

సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ...

బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు

మోదీలంతా దొంగలేనని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో...

భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్‌ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ ‘నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టీజే)’ హస్తం ఉందని శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ద్వీప దేశం నుంచి పారిపోయే అవకాశం ఉందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా భారత సముద్ర జలాల్లో గస్తీ నిర్వహించడానికి భారీగా షిప్పులను, డ్రోనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించినట్టు ఏఎన్‌ఐ వార్త సంస్థ తెలిపింది. భారత జలాల్లోకి ప్రవేశించే అనుమానిత బోట్స్‌ను గుర్తించడానికి పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం శ్రీలంకలో జరిగిన వరసు పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 300 మందికి చేరింది. దాయాది పాకిస్తాన్‌ నుంచి సుముద్ర జలాల గుండా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 2008 నవంబర్‌ 26వ తేదీన ముంబైలో మరణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.

పారదర్శకతకు నీరాజనం

అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్‌ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది.

ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్‌ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్‌ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం.

రఫేల్‌ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్‌ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్‌ ప్రధాని ఇచ్చిన ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది.

కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి… కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు.

తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్‌స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్‌ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టమిది.

ఈ సందర్భంగా పెంటగాన్‌ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్‌టైమ్స్‌’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ కౌల్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది.

చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్‌ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్‌ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం.

మోదీని ప్రధాని చేస్తే..

బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లోని పాలమావు జిల్లా మెదినినగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా శనివారం ప్రసంగించారు. ‘మీరు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయండి. మేం ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తాం’ అని ఆయన ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో భారత్‌ లక్ష్యంగా పాక్‌లోని ఉగ్రవాదులు తరచూ దాడులు చేసేవారని, ఉగ్రవాదులు మన జవాన్ల తలలు కూడా నరికేవారని పేర్కొన్నారు. ఇప్పుడు పాక్‌ నుంచి ఒక్క బుల్లెట్‌ వస్తే.. అందుకు బదులుగా ఏకంగా షెల్‌ను ప్రయోగిస్తున్నామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. ఒక్క దేశానికి ఇద్దరు ప్రధానులు ఉంటారా? కశ్మీర్‌ ఎప్పుడు భారత్‌లో అంతర్భాగమేనని ఆయన పేర్కొన్నారు.

40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో బరిలో దిగుతున్నారు.వీరందరినీ కలిపితే మోదీ ఈ సారి 50–60 మందితో తలపడాల్సి ఉంటుంది.బహుశా ఈ ఎన్నికల్లో అనేక మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వారణాసి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదు.

అయితే, గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే 42 మంది పోటీ చేశారు. వాటిలో ఒకటి మోదీ పోటీ చేసిన వారణాసి కాగా రెండోది తమిళనాడులోని దక్షిణ చెన్నై నియోజకవర్గం. ఆ ఎన్నికల్లో మోదీతో తలపడిన 41 మందిలో 40 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆప్‌ అభ్యర్థి కేజ్రీవాల్‌కు 2 లక్షల ఓట్లు వచ్చాయి. మోదీకి వచ్చిన 5.81 లక్షల ఓట్లలో ఇవి సగం కూడా లేవు. ఇక చెన్నై సౌత్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన జె.జయవర్ధన్‌ కూడా తనతో తలపడిన 41 మందిని ఓడించి 1.35 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ సారి కూడా ఆయన చెన్నై సౌత్‌నుంచే పోటీ చేస్తున్నారు.

రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ సింగిల్‌ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్‌ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడీ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. దీంతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. 2011లో డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు తరపున ఆడిన సంగక్కర 19 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019లో బంగ్లా వికెట్‌ కీపర్‌ నురుల్ హసన్‌ కూడా 19 డిసిమిసల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆర్సీబీతో ఆదివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ రెండు అద్భుత క్యాచ్‌లు పట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ కీపింగ్‌లో మాత్రం మెరిశాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టి క్లాసెన్‌, గురుకీరత్‌ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్‌ ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతేడాది ఐపీఎల్‌లో కూడా పంత్‌ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌(684)గా నిలిచాడు.

ధనాధన్‌ ధోని.. రికార్డులు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ధోని 42.03 సగటుతో 4330 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధసెంచరీలు ఉన్నాయి.

అంతేకాదు ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బాట్స్‌మన్‌గా కూడా ‘మిస్టర్‌ కూల్‌’ రికార్డు కెక్కాడు. 203 సిక్సర్లలో మూడో స్థానానికి చేరాడు. క్రిస్‌ గేల్‌(323), ఏబీ డివిలియర్స్‌(204) అతడి కంటే ముందున్నారు. రోహిత్‌ శర్మ(190), సురేశ్‌ రైనా(190), విరాట్‌ కోహ్లి(186) కూడా ధోనికి దగ్గరలో ఉన్నారు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(84)ను ధోని మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

కేరళకు..తారక్‌, ప్రభాస్‌, నాగార్జునల సాయం

తిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంతిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంగా...

read more

ఇది విన్నారా .. సమంతా మతం మార్చుకుందట?

టాలీవుడ్ గ్లామర్ భామ సమంతకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. కేరళ కుట్టి అయిన ఈ ముద్దుగుమ్మ పై ఈ మధ్య టాలీవుడ్ లో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఘాటు లవ్లో ఉన్న సమంత వివాహం త్వరలో జరుగుతుందని అంటున్నారు. దానికి ఖచ్చితంగా అనిపించే నిజం ఇదే .. మీరు కూడా...

read more

సెట్స్ లో రోజుకో బైక్ పై.. షారుక్ ఎంజాయ్..!

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న దిల్ వాలే చిత్రం షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోను ముంబైలోను ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక, ఖాళీ సమయంలో సెట్స్ లో నడుస్తూ తిరిగే పనిలేకుండా రోజుకో వాహనంపై షారుక్ తిరుగుతున్నాడట. అయితే, ఈ వాహనాలను...

read more

జెట్‌పై బ్యాంకుల కసరత్తు

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్‌...

read more

కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్‌ వ్యాపారవేత్త పీఎన్‌బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును...

read more

30 కోట్లు దాటిన జియో చందాదారులు

రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు...

read more

ఉద్యోగాల్లో కోత్త కోణం సరికొత్త పని…, నైపుణ్యాలకు పెద్దపీట మార్పునకు సిద్ధం అయితేనే అవకాశం

క్లర్క్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త... ఇవన్నీ ఇప్పటి ఉద్యోగాలు. కానీ సత్వర ఆర్థికాభివృద్ధికి తోడు శాస్త్ర- సాంకేతిక రంగం బహుముఖంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయి....

read more

ఏడాదికి 83 లక్షల జీతం!

ఉచిత ప్రపంచయానం.. రిసార్టుల్లో రాజభోగాలు మెక్సికోకు చెందిన విదాంతా గ్రూపు నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: మీకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టమా? అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉందా? దేశ దేశాల రుచులు ఆస్వాదించాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం...

read more

కరివేపాకుతో తేనీరు

శాస్త్రవేత్తలు కరివేపాకు గురించి పలు పరిశోధనలు, అధ్యయనాలు చేసి మఽధుమేహాన్ని అదుపు చేసే గుణం ఈ ఆకుకు ఉందని తేల్చారు. కరివేపాకులో ఉండే ఒక పదార్థం మధుమేహుల్లో స్టార్చ్‌ గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ను నెమ్మదించేలా చేస్తుందని శాస్త్రవ్తేలు తెలుసుకున్నారు. కాబట్టి కరివేపాకును...

read more

ఆరోగ్య ఫలం గుడ్‌ ఫుడ్‌

పనస లేదా దానిమ్మ వంటి పండ్లలోని భాగాలను తొనలు అంటారు. కానీ చిత్రమేమిటంటే.. సీతాఫలంలోని గింజలకు చుట్టుకొని ఉండే కమ్మని, తియ్యని తినే  భాగాల్ని కండ్లు అంటారు. సీతాఫలాలను తింటే కళ్లకు మేలు. అందులో పుష్కలంగా ఉండే విటమిన్‌–ఏ కంటి చూపు చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. ఈ కారణంతో...

read more

ఫ్యాట్కిన్స్‌ డైట్‌

  ఫ్యాట్కిన్స్‌ డైట్‌  ఊబ  కాలమ్‌ 1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్‌ ఆట్కిన్‌ అనే ఆయన ‘ఆట్కిన్స్‌ డైట్‌’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ...

read more

శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.

ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.

కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు…?

దైవానికి కొబ్బరికాయను కొట్టడం చూస్తుంటాం. కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగంవతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతుని స్మరిస్తూ కొట్టాలి.

రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ దిశగా ఉండేటట్లు చేయటం మంచిది. కొబ్బరికాయ సరిసమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ, కుళ్లిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులచెందాల్సిన అవసరం లేదు.

అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటితో మాత్రమే అభిషేకించాలి.

స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ఎలాగంటే….

హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. స్థానికంగా మంచి పట్టున్న ఓ రాజకీయ పార్టీ అండ చూసుకుని గత కొన్నేళ్లుగా ఈ గ్యాంగ్ తన వికృత చేష్టలను కొనసాగిస్తూ వచ్చింది. కొన్నేళ్లుగా చేస్తున్నా.. ఒక్కరంటే ఒక్క బాధితురాలు కూడా ధైర్యం చేసి...

read more

శ్రీకృష్ణుడంతటి వాడే నీలాపనిందలపాలైయ్యాడట!

"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే" అంటూ ప్రార్థించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తాం. తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజ చేస్తాం. పిన్నల నుండి పెద్దల వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ....

read more

యుద్ధం చేయాల్సి వస్తే… 20 రోజుల్లో మన ఆయుధ సంపత్తి ఖాళీ!

ఓ వైపు దాయాది పాకిస్తాన్ కవ్వింపు. మరోవైపు చైనా చొరబాటు. రెండు వైపుల నుంచి భారత్ కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఏదో ఒక వైపు అనుకోని రీతిలో యుద్ధం చేయాల్సి వస్తే. గతంలో చేశాంగా, ఇప్పుడెందుకు భయమనేగా? అప్పుడు ఓకే, కాని ఇప్పుడు ఓకే చెప్పేందుకు మన మిలిటరీ కాస్త తటపటాయించడం...

read more

గర్భిణీ మహిళలు.. ఆ క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా వుండండి..

క్యాన్సర్ యొక్క లక్షణాలుగా రొమ్ము సున్నితత్వం, లేదా ఛాతీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇవి గర్భధారణ సమయంలో మహిళల రొమ్ముల్లో సంభవించే మార్పులను పోలి ఉంటాయి. ఒకవేళ వైద్యులు రొమ్ములో అనుమానాస్పద కణితిని కనుగొన్న ఎడల, సాధారణంగా ప్రభావిత రొమ్ముకు, మామోగ్రఫీ కన్నా,...

read more

ఇల్లు చాలా డేంజర్‌

మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో...

read more

స్త్రీలోక సంచారం

తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్‌ బజార్‌ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్‌ అత్యంత ఆదరణ...

read more

నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్దికి...

read more

పిల్లలు జర భద్రం!

వానలతోపాటే వ్యాధులూ విజృంభిస్తాయి. నిల్వ నీరు, మురుగు, దోమలు, ఈగలు... వీటి కారణంగా పెద్దల కంటే పిల్లలే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడతారు. కాబట్టి వానల్లో పిల్లలను ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుకోవాలి! వానాకాలం వ్యాధులు టైఫాయిడ్‌, విరేచనాలు, వాంతులు, జలుబు,...

read more

ఆబాల గోపాలం!

మరో రెండు రోజుల్లో కృష్ణాష్టమి! పిల్లలను ముచ్చటైన దుస్తుల్లో ముస్తాబు చేయడమే ఈ పండగకున్న ప్రత్యేకత! మరి మరోసారి సంప్రదాయ కట్టూబొట్టులో చిన్నారుల్ని సింగారించి మురిసిపోదామా... ఎంకి పాటే కాదు, రూపమూ రమ్యమే! కోక, రవిక.... వాటికి తగిన కొప్పు కట్టేసి ఎంకిని తలపించేలా...

read more

కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ

గొప్ప కుటుంబంలో జన్మించడం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టడం కాదని, ఇష్టమైన పని కోసం అవసరమైతే ఎంతకైనా తెగించాలని నిరూపించారు డా. రాజేశ్‌ కడాకియా. తాను చదువుకునే గాంధీ కాలేజీలో సమస్య ఉందని తెలుసుకుని తాతయ్యతో పొట్లాడి రెండున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ...

read more

వెబ్ డిజైనింగ్‌లో టీనేజీ సంచలనం

శ్రీలక్ష్మీ సురేశ్‌... పసి వయసులోనే డిజిటల్‌ ప్రపంచంతో పరిచయమైన అమ్మాయి. తొమ్మిదేళ్ళ క్రితం పట్టుమని పదేళ్ళ వయసులోనే ఏకంగా తనకంటూ ఒక కంపెనీ (ఇ-డిజైన్‌ టెక్నాలజీస్‌) స్థాపించిన ఔత్సాహికురాలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన సి.ఇ.ఓలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన...

read more

దావోస్‌లో మన దీపిక

‘మా స్వస్థలం నిజామాబాద్‌. నేను పుట్టింది మాత్రం కర్ణాటకలో! పెరిగింది... ఫలానా చోట అని చెప్పలేను. దేశమంతటా అనొచ్చు. అదేంటి! అని ఆశ్చర్యపోకండి... నాన్న పి.వి. దుర్గాప్రసాద్‌ సాయుధ బలగాల్లో పనిచేసేవారు. అందుకే ఏడు వేర్వేరు సిటీల్లో పెరిగాను. పదకొండు స్కూల్స్‌లో చదివాను....

read more

యూఏఈ నుంచి 175టన్నుల సహాయ సామగ్రి

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ వరద బాధిత కేరళకు సహాయక సామగ్రిని తీసుకురానుంది. ఎమిరేట్స్‌ విమానంలో 175టన్నుల సహాయ సామగ్రిని కేరళకు పంపిస్తున్నారు. కేరళ వాసులకు యూఏఈ అండగా ఉంటుందని, ఎమిరేట్స్‌ స్కై కార్గో విమానం ద్వారా...

కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళం!

నాటింగ్‌ హామ్‌ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని...

షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?

ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని భార్య: "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!" సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా...

వంట చేసి పెడితే నాకేమిస్తారు?

భార్య: మన వంటవాడికి నెల రోజులు సెలవు ఇచ్చేసి నేనే స్వయంగా మీకు వండిపెట్టాలనుకుంటున్నాను, అలా చేస్తే నాకు ఏం కానుక ఇస్తారు? భర్త: నా ఇన్సురెన్స్...

ఆ సిమ్‌కార్డ్‌ పనిచేయకపోతే భారీ పెనాల్టీ

టెలికాం రెగ్యులేటరీ  అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)   ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సిమ్‌ కార్డ్‌, గ్లోబల్‌ కార్డ్‌ ప్రొవైడర్లకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఈమేరకు  టెలికాం  డిపార్ట్‌మెంట్‌ (డాట్‌)కు  కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే  రూ. 5వేల నష్టపరిహారం...

అనిల్‌ అంబానీ సంచలన నిర్ణయం

రిలయన్స్ గ్రూపు చైర్మన్  అనిల్ ధీరూబాయ్‌  అంబానీ సంచలన నిర్ణయం  తీసుకున్నారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నుంచి ఎలాంటి వేతనం  తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న  ఆర్‌కామ్‌ను అదుకునేందుకు  ఈ చర్యకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...

ఒక శతాబ్దాన్ని పూడ్చేశాం

కరుణానిధి స్మృతిలో నా ఆచార్యా నువ్వులేని సమయంలో నిన్ను తలచుకుంటున్నాను నేను చందమామని సాహితీ వెలుగునిచ్చిన సూరీడివి నీవే! నువ్వు విచిత్రాల చిత్రం చిత్రాల విచిత్రం నీ అడుగుజాడలను కలిపితే ఒక బాటే ఏర్పడుతుంది నీ మాటలను కలిపితేరము ఒక భాషే ఏర్పడుతుంది నీ విజయాలను కలిపితే ఒక...

ఆ సిమ్‌కార్డ్‌ పనిచేయకపోతే భారీ పెనాల్టీ

టెలికాం రెగ్యులేటరీ  అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)   ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సిమ్‌ కార్డ్‌, గ్లోబల్‌ కార్డ్‌ ప్రొవైడర్లకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఈమేరకు  టెలికాం  డిపార్ట్‌మెంట్‌ (డాట్‌)కు  కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే  రూ. 5వేల నష్టపరిహారం...