Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సోంపు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. సోంపు తీసుకోవడం వలన అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చును. ముఖ్యంగా కడుపునొప్పితో బాధపడేవారు తరుచు సోంపు తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. హోటల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి.. ఇలాంటి సోంపుతో టీ తయారుచేసి తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..

స్పూన్ ఎండిన సోంపును కప్పు వేడినీటిలో వేయాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తరువాత వేడినీరు లేత పసుపు రంగులోకి వచ్చాక, ఆ నీటిని మరో కప్పులోకి వడబోసి తీసుకుంటే సరిపోతుంది.

సోంపు టీని భోజనం చేసిన తర్వాత తాగాలి. అప్పుడే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలున్నవారు రోజుకు మూడుసార్లు సోంపు టీ తాగితే ఫలితం ఉంటుంది. సోంపు గింజల్లోని నూనెలు ఆహారం తొందరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి.

సోంపు గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజూ నిద్రలేవగానే సోంపు టీ తాగితే.. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దాంతోపాటు శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.