రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా తెలంగాణాలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన తరువాత సోనియా బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఈ రోజు కరీంనగర్ లో తెలంగాణ గురుంచి తొలిసారిగా మాట్లాడుతుండడంతో, ఆమె ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అటు కాంగ్రెస్ నేతల్లోను ఇటు ప్రతిపక్ష నేతల్లోను నెలకొంది. తెలంగాణ ఏర్పాటుతో పాటు భవిష్యత్లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా సోనియాగాంధీతో ఇక్కడ నుంచి ప్రకటన చేయించే దిశగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు లక్షా 50 వేల మందిని సమీకరించాలనే లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 వేల వరకు జనసమీకరణ జరపాలని చూస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ రానున్నారు.4 నుంచి 4:30 వరకూ సభలో పాల్గొంటారు.