Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్‌: నందమూరి హరికృష్ణ నివాసానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాట్ల గురించి మాట్లాడారు.

నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి నుంచి పార్థివ దేహాన్ని మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. తెలంగాణ మంత్రులు, కేటీఆర్‌, మహమూద్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకొని నివాళి అర్పించారు. గవర్నర్‌ నరసింహన్‌ మరికొద్ది సేపట్లో రానున్నారు.