Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రకుల్‌ప్రీత్ సింగ్‌కు గుర్తింపు ఉంది. ఆ మధ్య వరుస సినిమాలతో టాలీవుడ్ టాప్ స్టార్లందరితో జతకట్టిన ఈ భామకు గతేడాది మాత్రం సైరైన హిట్ పడలేదు. అయినా కూడా వెండితెరపై అందచందాలతో ప్రేక్షకులకు గ్లామర్ డోస్ ఇవ్వడంలో తనకు ఎవ్వరూ సాటికాదన్నట్లుగా యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది రకుల్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచమైన ఈమె ‘అయ్యారీ’ ద్వారా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ ఇలా ఉండగానే.. బాలీవుడ్‌లోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా పట్టేసిందనే వార్త వినిపిస్తోంది.
 భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా అకివ్‌ అలీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒకప్పటి టాప్ హీరోయిన్ టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విశేషమేమిటంటే.. నిర్మాత భూషణ్‌ కుమారే అంతకుముందు ‘యారియాన్‌’ సినిమా ద్వారా రకుల్ ని బాలీవుడ్ తెరకు పరిచయం చేశాడు.