Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో అవధ్‌ వారియర్స్‌కు హైదరాబాద్‌ హంటర్స్‌ షాకిచ్చింది. ఆదివారం జరిగిన పోరులో హంటర్స్‌ 6-(-1)తో అవధ్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఈ పోరులో అన్ని మ్యాచ్‌లనూ హైదరాబాద్‌ నెగ్గడం విశేషం. ఎంతో ఆసక్తి రేకెత్తించిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ 15-5, 15-7 స్కోరుతో సైనా నెహ్వాల్‌ను ఓడించింది. హైదరాబాద్‌కు ఇది ట్రంప్‌ మ్యాచ్‌. అంతకుముందు అవధ్‌ వారియర్స్‌ ట్రంప్‌ మ్యాచైన పురుషుల సింగిల్స్‌లోనూ హైదరాబాద్‌దే పైచేయి అయింది. ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ 15-10, 15-10తో అవధ్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. మరో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్‌ 13-15, 15-9, 15-14తో పారుపల్లి కశ్య్‌పపై గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ హైదరాబాద్‌ విజయాలు నమోదు చేసింది.