ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావును కలిసేందుకు నల్గొండకు చెందిన టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్రెడ్డి బుధవారం అసెంబ్లీకి వచ్చారు. భూపాల్రెడ్డి ప్రస్తుతం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్గా ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యత్వం కోల్పోవడంతో త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తుండగా… టీఆర్ఎస్ అభ్యర్ధిగా కంచర్ల భూపాల్రెడ్డిని పోటీలో దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు బుధవారం అసెంబ్లీకి భూపాల్రెడ్డి వచ్చారు.
సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన కంచర్ల భూపాల్రెడ్డి
by Indira | Mar 14, 2018 | రాజకీయం | 0 comments