Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ఉన్న తాను గతరాత్రే ఇండియాకు వచ్చానని.. ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకున్నానని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరితోనూ ఇకపై పనిచేసేది లేదని ఆయన ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ మూవీ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు.

‘‘నేను గత రాత్రే ఇండియాకు వచ్చాను. డిస్టర్బింగ్ కలిగిస్తున్న న్యూస్ అంతా చూశాను. వెంటనే నేను ‘హౌస్‌ఫుల్ 4’ మూవీ ప్రొడ్యూసర్‌కి కాల్ చేసి విచారణ పూర్తయ్యేవరకూ సినిమా షూటింగ్‌ను నిలిపివేయాలని కోరాను. ఇలాంటి యాక్షన్ తీసుకోవడం అవసరం. ఆరోపణలు నిర్థారణ అయిన ఏ ఒక్కరితోనూ నేను పనిచెయ్యను. అలాగే వేధింపులకు గురైన వారందరికీ వారు కోరుకున్న న్యాయం జరగాలి’’ అంటూ అక్షయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.