సీఎం చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? అంటూ ట్వీట్ చేశారు. వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా, అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్, అరాచక రాజకీయ హత్యలతో మమతా..వీరితోనా నీ ప్రచారం..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది అని నిప్పులు చెరిగారు.