Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

యాదాద్రి జిల్లా వాసికి ఆస్ట్రేలియాలో కీలక పదవి

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన సాయిని రాజ్‌కుమార్‌ విక్టోరియా రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. తాళ్లగూడానికి చెందిన ఆయన, 2008లో ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్‌లో న్యాయవిద్య అభ్యసించి, అక్కడే న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. మెల్‌బోర్న్‌ నేషనల్‌ వర్చువల్‌ యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఆయన సేవలను గుర్తించి.. గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2017లో రాజ్‌కుమార్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. రాజకీయంగా చురుగ్గా ఉన్న ఆయనను విక్టోరియా రాష్ట్రం, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. తమ కుమారుడు ఈ స్థాయికి ఎదిగినందుకు రాజ్‌కుమార్‌ తల్లిదండ్రులు ఆశయ్య, లక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు.