Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నవరాత్రుల్లో మూడో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతోంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆ యా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆ యా దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు.

గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుంది. ఆరోగ్యం లభిస్తుంది. వరదాభయహస్తాలతో… సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుంది. గాయత్రిని వేదమాతగా కొలుస్తూ, ఆమెను దర్శించడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు. ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. పూజించిన వారికి సద్బుద్ధులు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. అజ్ఞానం తొలగిపోతుంది. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్‌ ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!

నైవేద్యం: అల్లం గారెలు, ఐదు రకాల పిండివంటలు
అలంకరించే చీర రంగు: కాషాయ వర్ణం
పారాయణ చెయ్యాల్సింది: గాయత్రీ మంత్రం