Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొత్త ఏడాది సంబురం ఇంకా పూర్తిగా తీరనేలేదు. అప్పుడే ప్రజల్లో కలవరపెట్టే మెసేజ్‌లు. టెలికాం సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేస్తూ… ఎస్‌ఎంఎస్‌ల వెల్లువ కొనసాగుతోంది. ఈ మెసేజస్‌లోని సందేశం.. జనవరి 7 నుంచి మీ నెంబర్‌పై వాయిస్‌ సర్వీసులు ఆగిపోనున్నాయని. ఇతర నెట్‌వర్క్‌లోకి మీ నెంబర్‌ను మార్చుకుంటేనే పనిచేస్తాయంటూ ఆందోళనకర మెసేజ్‌లు వస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లకు ఈ మెసేజ్‌లు వెళ్తున్నాయి. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్‌ వేదికగా టెలికాం కంపెనీలకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.

అయితే ఈ మెసేజ్‌లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల  ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్‌లను అని, యూజర్లు ఆ మెసేజ్‌ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్‌ ప్రతినిధి ఆ మెసేజ్‌ను ఓ  స్పామ్‌గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిసింది.