Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

  • మేడి పండ్లను నీడన ఎండించి చేసిన చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి, 10 గ్రాముల చొప్పున ప్రతి రోజూ సేవిస్తూ ఉంటే, రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చ ర్మం కాంతివంతమవుతుంది.
  • మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధత తొలగిపోతుంది. లేదా తరుచూ మేడిపండ్లను తింటూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
  • 60 గ్రాముల మేడి బెరడును నలగగొట్టి, 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత వడబోసి అందులో ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది
  • 60 మి. లీ మేడి పండ్ల రసంలో అరస్పూను కరక్కాయ పొడి కలిపి ప్రతి రోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది.
  • మేడిచెట్టు బెరడు చూర్ణానికి సమంగా పటిక బె ల్లం కలిపి, తులం మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తూ ఉంటే, తెల్లబట్ట సమస్య పోవడంతో పాటు పలురకాల గర్భాశయ వ్యాధులు నయమవుతాయి.
  • 50 – 60 మి. లీ మేడిపండ్ల రసంలో కొద్దిగా తేనె చేర్చి సేవిస్తూ, పాల అన్నం మాత్రమే తింటూ ఉంటే అధిక రకస్రావ సమస్య తొలగిపోతుంది.
  • 10 గ్రాముల మేడి పండ్ల రసాన్ని గానీ, 60 మి. లీ బెరడు కషాయాన్ని గానీ, 40 రోజుల పాటు క్రమం తప్పకుండా సేవిస్తే, అతి మూత్ర వ్యాధితో పాటు, మూత్రంలో రక్తం పడటం కూడా తగ్గుతుంది.
  •  మేడి చెట్టు జిగురుకు నాలుగు రెట్లు చక్కెర కలిపి 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా సేవిస్తూ ఉంటే అధిక వేడి తగ్గుతుంది.
  • 250 మి. లీ చెక్క కషాయంలో 3 గ్రాముల పొంగించిన పటిక చూర్ణం కలిపి రోజుకు మూడు పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటి అల్సర్లు మానిపోతారు.