Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం గురించి రీసెంట్‌గా కొన్ని వార్తలు వినిపించాయి. బోయపాటి శ్రీనుతో రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ఆగిపోయిందని, దీనికి కారణం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ చేయబోతున్న మల్టీస్టారర్ చిత్రమే అనే వార్తలు విపరీతంగా సంచరించాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది. ఈ సినిమా జనవరి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లబోతుందట. జనవరి 19 నుండి రామ్ చరణ్‌పై కొన్ని కీలకమైన సీన్లను బోయపాటి చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని జనవరి 24న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ కోసం మెగాభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాగే పక్కా మాస్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ సెట్ పైకి వెళ్లబోతుందనే విషయం తెలిసిన మెగాభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.