అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ముంబై నుంచి పూణే వరకు దక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్ రైలును మహిళా డ్రైవర్లు నడిపి చరిత్ర సృష్టించారు. ఆసియాలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవరు సురేఖాయాదవ్, సీనియర్ అసిస్టెంట్ లోకో పైలెట్ తృష్నా జోషితో కలిసి ఈ రైలు నడిపారు. ఈ ప్రత్యేక మహిళా రైలుకు గార్డుగా ఉన్న శ్వేతా పచ్చజెండా ఊపగానే రైలు ప్రారంభమైంది. ఈ మహిళా రైలులో టికెట్ తనిఖీ సిబ్బందితోపాటు రైల్వే పోలీసు ఫోర్సు సిబ్బంది, ఎలక్ట్రికల్ టెక్నిషీయన్ లు సైతం మహిళలే ఉండటం విశేషం. మహిళా దినోత్సవ వేళ ఈ మహిళా స్పెషల్ రైలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.