న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది. రెండేళ్ల పాటు ఆమె సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. మేరీ కోమ్, సంస్థకు మధ్య చాలా పోలికలున్నాయని.. ఆమెతో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషకరమని బిఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండి అనుపమ్ శ్రీవాస్తవ అన్నారు. ఆమె ద్వారా బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ ప్రచారానికి రూ.30 లక్షలు ఖర్చు చేయనున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు.
బిఎస్ఎన్ఎల్ ప్రచారకర్తగా మేరీ కోమ్
by Indira | Sep 5, 2018 | Slider News, బిజినెస్ | 0 comments