ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చింది. ‘మొబైల్ బొనాంజా’ పేరుతో పలు కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్-ఎక్స్పై అత్యధికంగా రూ. 9001ల డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిఫ్కార్ట్ పేర్కొంది.
ఐఫోన్-ఎక్స్ 64జీబీ వేరియంట్ మామూలు ధర రూ. 89,000 ఉండగా పదిశాతం డిస్కౌంట్తో రూ. 79,999లకే అందిస్తున్నట్లు ఫ్లిఫ్కార్ట్ ప్రకటించింది. ఈఎంఐతో కొనాలనుకునే వారు నెలకు రూ.2,735 ప్రారంభ ధరతో పొందొచ్చని, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి రూ. 18వేల తగ్గింపు ఉంటుందని ఫ్లిఫ్కార్ట్ తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్టు ఉన్నవాళ్లకు ధరలో 5 శాతం తగ్గింపు ఉన్నట్లు కూడా ఫ్లిప్కార్ట్ పేర్కొంది.