సొంతగడ్డపై జరగనున్న ఇండియా ఓపెన్ బ్యా డ్మింటన్ టోర్నీలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీలో రెండుసార్లు విజేత సైనా ఐదోసీడ్గా, 2017 చాంపియన్ సింధు రెండో సీడ్గా పోటీపడనున్నారు. ఒకవేళ సైనా క్వార్టర్స్కు చేరితే రచనోక్ ఎదురయ్యే అవకాశం ఉంది. సింధుకు మాత్రం సెమీస్ వరకు ఎదురుండకపోవచ్చు. పురుషుల విభాగంలో 2015 విజేత కిడాంబి శ్రీకాంత్కు మూడో సీడ్ దక్కింది. కశ్యప్, సమీర్ వర్మ, గురుసాయిదత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.