పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందన్న సామెత మనకు ఉండనే ఉంది. లండన్ పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. పెళ్లితో పిచ్చికి చెక్ పెట్టవచ్చని తేల్చారు. పెళ్లి చేసుకుంటే లేటు వయసులో వచ్చే చిత్తవైకల్య ముప్పు తప్పుతుందంటున్నారు. బ్రహ్మచారులు, వితంతువులకు ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఎక్కువంటున్నారు. యూరప్, ఉత్తరఅమెరికా, దక్షిణ అమెరికా, ఆసియాలకు చెందిన 8 లక్షలమందిపై పరిశోధనల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు తెలిపారు. పెళ్లి అయిన వారిలో కంటే సింగిల్స్కు ఈ ముప్పు 42శాతం ఎక్కువ అన్నారు.