ఫొటోజర్నలిస్టు తమ్మా శ్రీనివాసరెడ్డి ఎంపిక
అమరావతి, ఆగస్టు 30: ఫొటోగ్రఫీ రంగంలో ఎనలేని సేవ చేసిన వారికి బహూకరించే ప్రతిష్ఠాత్మక హానరరీ ఎక్సలెన్స్ ఐయూఎ్సఎఫ్ అవార్డు, తెలుగు ఫొటో జర్నలిస్టు తమ్మా శ్రీనివాసరెడ్డిని వరించింది. ప్రపంచం మొత్తంలో నలుగురిని మాత్రమే ఎంపిక చేయగా వారిలో భారత్ నుంచి శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారని ఐసీఎస్ వ్యవస్థాపకుడు టోనీ లీ కిమ్ థుయాన్ వెల్లడించారు. నవంబరులో జరగనున్న అంతర్జాతీయ ఫొటోగ్రఫీ కన్వెన్షన్లో ఈ అవార్డును అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి 3 ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు అందుకున్నారు. గత పాతికేళ్లలో 168 బంగారు పతకాలు, 497 అవార్డులు, 876 గౌరవసత్కారాలు లభించాయి. ప్రస్తుతం ఆయన ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్కు అధ్యక్షుడు.