Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జియో మార్కెట్లోకి వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. సెప్టెంబరు 2016లో టెలికం రంగంలో అడుగుపెట్టిన జియో ప్రకంపనలు సృష్టించింది. ఉచిత కాల్స్‌తో ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో దడ పుట్టించింది. ఈ 24 నెలల్లో టెలికం రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న జియో.. వినియోగదారులకు మరింత అధిక డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జియో సరికొత్త సెలబ్రేషన్స్ ప్యాక్ ద్వారా యూజర్లకు ప్రతీ రోజూ 2జీబీ డేటాను అదనంగా ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న ప్యాక్‌లలో లభిస్తున్న డేటాకు ఇది అదనం.
జియో సరికొత్త సెలబ్రేషన్స్ ప్యాక్ ద్వారా యూజర్లకు ప్రతి రోజూ రోజుకు 2జీబీ డేటా ఈ నెల 11వ తేదీ వరకు లభిస్తుంది. అంటే మొత్తం 10 జీబీ డేటా అదనంగా లభిస్తుందన్నమాట. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజూ రాత్రి 12 గంటలకు ఈ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది.
రెండో వార్షికోత్సవం సందర్భంగా జియో కాడ్బరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డైరీ మిల్క్ చాక్లెట్ కానీ, డైరీ మిల్క్ క్రాకెల్, డైరీ మిల్క్ రోస్ట్ అల్మండ్, డైరీమిల్క్ ఫ్రూట్, నట్ తదతరాలు కొనుగోలు చేసే వారికి అదనంగా రోజుకు 1జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.5 నుంచి రూ.100 చాక్లెట్ల కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. చాక్లెట్ రేపర్ మీద ఉన్న బార్‌కోడ్‌ను యూజర్లు స్కాన్ చేయడం ద్వారా ఉచిత డేటాను పొందవచ్చు.