సెకండ్ షో’ సినిమాతో ప్రాచుర్యంలోకి వచ్చిన మళయాళ నటుడు సిద్ధు ఆర్ పిళ్లై గోవాలో శవమై కనిపించడం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. గోవా లోని బీచ్లో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఆయన మరణించాడని ప్రాథమిక సమాచారం. సోమవారం సాయంకాలం ఈ మృతదేహం సిద్ధుదే అని అతని తల్లి గుర్తించింది. కానీ ఈ విషయాన్ని ఇంకా పోలీసులు మాత్రం ఇంకా నిర్ధారించలేదు. మృతి పట్ల ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.
జనవరి 12న ఆయన ఇంటి నుంచి గోవాకు బయల్దేరిన సిద్దు ఒక్కసారిగా శవమై కనిపించడం కుటుంబ సభ్యులను కలచివేసింది. సిద్దు మృతి పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు నటులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సిద్దు మరణ వార్త విన్న దుల్కర్ సల్మాన్ ‘సిద్ధు ఆర్ పిళ్లై మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ‘సెకండ్ షో’ సినిమా షూటింగ్లో అతను చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’ అని తెలుపుతూ ట్వీట్ చేశారు.