Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

డైలాగ్ కింగ్ మోహన్‎బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. చిత్రంలో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంచు విష్ణు, శ్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ బాణీలు కట్టారు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కోపంగా చూస్తున్న మోహన్‌బాబు లుక్‌తో పాటు ‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే.. నాదీ తప్పే’ అనే కాప్షన్ రాసి ఆకట్టుకుంది చిత్రయూనిట్.
అదే తరహాలో తాజాగా శ్రియ లుక్  బయటకు వదులుతూ ‘నేనెదనుకుంటే అది చెప్పడం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత..’ అనే కాప్షన్ పోస్టర్ పై ఉంచారు. ఈ లుక్‌లో చీరకట్టులో చూడముచ్చటగా ఉన్న శ్రియ, ఆకట్టుకుంటూ డిఫరెంట్‌గా ఉన్న ఈ కాప్షన్.. సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 9న భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ మొదటిసారి జంటగా నటిస్తుండటం ప్రత్యేకమైన అంశం. అంతేకాదు ఈ చిత్రంలో వారిద్దరూ భార్యాభర్తలుగా దర్శనమీయనుండటం మరో విశేషం.