ఎముకల కేన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి వైద్య చికిత్స కోసం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేయూత నిచ్చారు. ముద్దిరెడ్డి పల్లికి చెందిన ప్రవీణ్కుమార్ కొంతకాలంగా బోన్ కేన్సర్తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎమ్మెల్యే బాలకృష్ణను ఆశ్రయించాడు. ఇందుకు స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలు, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీన్కుమార్ను బాలకృష్ణ గురువారం పలకరించి సీఎం సహాయననిధికి సంబంధించిన రూ.10 లక్షల పత్రాన్ని అందజేశారు. త్వరలోనే ప్రవీణ్కుమార్కు శస్త్ర చికిత్స చేయనున్నారు. వైద్య చికిత్స పొంది త్వరగా కోలుకోవాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.