Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగా ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కెనడా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొంతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణారెడ్డి, ఆర్‌.సుబ్రహ్మణ్యం, భూషన్‌ తదితరులు పాల్గొని వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.