కువైట్: కువైట్లోని భారత రాయబారి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి జీవసాగర్ జెండా వందనం చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. కువైట్లోని తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ సుధాకర్ ఆధ్వర్యంలో విచ్చేసిన భారతీయులకు మిఠాయిలు, అల్పాహారం అందజేశారు. తెలుగు దేశం కువైట్, తెలుగు సేవా సమితి అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్రావుతో పాటు పీఆర్వో మద్దిన ఈశ్వర్ నాయుడు, అధికార ప్రతినిధులు సుబ్బారెడ్డి, బాషా, సంక్షేమ కార్యదర్శి గూదే నాగార్జున, మద్దిన వెంకటేశ్, గడికోట కోటి, వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు పగడాల అంజన్కుమార్, పెరుగు ప్రభాకర్ యాదవ్, ఛోటు తదితరులు పాల్గొన్నారు.
కువైట్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
by Indira | Aug 19, 2018 | Slider News, World News, ఎన్నారై, వార్తలు | 0 comments