ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా మరోసారి ‘ఐ ఫోన్ ఫెస్ట్’ అమ్మకాలకు తెర తీసింది. అమెజాన్ వెబ్సైట్, యాప్లలో ఐఫోన్ ఫెస్ట్ పేరిట నిర్వహిస్తున్న స్పెషల్ సేల్ను మంగళవారం ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక విక్రయాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 , ఐఫోన్ ఎస్ఈ లాంటి స్మార్టఫోన్లపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన ఆపిల్ వాచ్ మోడల్స్పై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది.
ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్ 256జీబీ రూ.97,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర (ఎంఆర్పీ) రూ.1,08,930గా ఉంది. ఇదే స్మార్ట్ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధరల రూ.95,390 ఉండగా ప్రస్తుతం ఐఫోన్ ఫెస్ట్లో ఇది రూ.79,999 ధరకు లభిస్తున్నది. ఐఫోన్ 8 (64 జీబీ) రూ.54,999 కు (ఎంఆర్పీ రూ.67,940), ఐఫోన్ 8 (256జీబీ) రూ.68,999కు (ఎంఆర్పీ రూ.81,500), ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ రూ.65,999కు (ఎంఆర్పీ రూ.77,560), ఐఫోన్ 8 ప్లస్ 256జీబీ రూ.79,999కు (ఎంఆర్పీ రూ.91,110) లభిస్తున్నాయి.