Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రభుత్వరంగ ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూపు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ బిడ్‌ వేసే అవకాశాలున్నట్లు ఎయిర్‌ విస్తారా సీఈవో లెస్లీతింగ్‌ సంకేతిమిచ్చారు. టాటా గ్రూపు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ల సంయుక్త సంస్థ విస్తారా అన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో లెస్లీతింగ్‌ మాట్లాడారు.

అయితే, టాటాగ్రూపు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కలసి బిడ్‌ వేస్తాయా లేక విడిగానా అన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ సేవల్లోకి ప్రవేశించడం, సేవల విస్తరణపైనే ఇరు సంస్థలూ ఫోకస్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లో 13 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు గతంలోనే ఇండిగో, టాటా గ్రూపు ఆసక్తి వ్యక్తీకరించాయి.