Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మాస్ మహారాజా రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో రవితేజ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఇంతకు ముందు నేను చేసిన పోలీస్ పాత్రలన్నీ చాలా సీరియస్‌గా ఉంటాయి. కానీ ‘టచ్ చేసి చూడు’లో మాత్రం సిన్సియారిటీతో పాటు నా స్టైల్లో కామెడీ కూడా ఉంటుంది. అంతా కొత్త దర్శకుడు అంటున్నారు కానీ అతనికి దర్శకత్వం కొత్త కాదు. చాలా సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాడు. మొదటి నుంచి విక్కీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ఎలాంటి ఇబ్బందీ పడలేదు. వెంకీ కూడా నేను అనుకున్నదానికంటే డబుల్ చేసి చూపించాడు.
ఇక ఇందులో నటించిన హీరోయిన్‌ల గురించి చెప్పాలంటే నాతో ఫస్ట్ టైమ్ నటించిన సీరత్ కపూర్ కొన్ని కొన్ని సీన్లలో నన్ను డామినేట్ చేసేసింది. రాశీ ఖన్నా మంచి కామెడీ చేస్తూ ఎంటర్‌టైన్ చేసే పాత్రలో నటించింది. ఇద్దరూ ఈ సినిమాలో అద్భుతంగా చేశారు..’’ అని అన్నారు.