నాటింగ్హామ్: ఆసియీ క్రీడల్లో భారత్ మొట్టమొదటి సెపక్తక్రా పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-బిలో ఉన్న భారత పురుషుల టీమ్ సోమవారం సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం సెమీఫైనల్లో భాగంగా థాయ్లాండ్తో తలపడింది.
ఈ మ్యాచ్లో భారత్ 0-2తో ఓడిపోయింది. దీంతో భారత్ కాంస్యంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. సెపక్తక్రాలో భారత్కు ఇదే తొలి పతకం. ఈ పోటీల్లో సెమీఫైనల్ చేరిన జట్లకు కాంస్యం ఖాయమవుతుంది. సెపక్తక్రా వాలీబాల్ తరహాలో ఉంటుంది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.