Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి గతనెల 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసు లో పట్టుపడ్డ విషయం అందరికి విదితమే. తన షూటింగ్ బిజీ వల్ల మొదట్లో కౌన్సెలింగ్ కు హారాజారు కానీ ఆయన తర్వాత తన తండ్రితో కలిసి కౌన్సెలింగ్ కి హాజరయిన విషయం తెలిసిందే. ఆ తర్వాతిరోజు కోర్టుకి హారాజరుకావలసిన ఆయన కౌన్సెలింగ్ నివేదిక ఆలస్యం వల్ల కోర్టుకి హాజరుకాలేకపోయానని చెప్పి, మరుసటి రోజు కూడా షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయానని చెప్పుకొచ్చారు. తర్వాత 16 వ తేదీన కోర్టుకి హాజరు అవుతానని చెప్పిన ఆయనకు కనుమ పండుగ సందర్భంగా కోర్ట్ సెలవు అని పోలీస్ లు చెప్పడం తో, ఈ నెల 22 న నాంపల్లి కోర్ట్ కి హాజరవుతానని చెప్పినట్లు పోలీస్ సమాచారం.

నిజానికి ప్రదీప్ పై డ్రంకెన్ డ్రైవ్ కేసు తో పాటు కారుకి నల్ల అద్దాలు పెట్టినందుకు మరొక కేసు కూడా వుంది. డ్రంకెన్ డ్రైవ్ కేసు లో పట్టుపడి, బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 178 పాయింట్లు తో పట్టుబడిన ఆయనకు ఫైన్ పడుతుందా, శిక్ష పడుతుందా లేక ఫైన్, మరియు శిక్ష రెండూ పడుతాయా అనేది వేచి చూడాలి. అయితే సాధారణ ప్రజలకు ఒక లా సెలెబ్రెటీలకు మరోలా వ్యవహరించడం పై సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…