Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిస్కృతమైంది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు ఏడు నిమిషాల పాటు స్వామివారిని తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి గత మూడేళ్లుగా మేఘాలు అడ్డుపడుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు బంగారం ఛాయ లేలేత కిరణాలు తాకాయి. దీంతో భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించారు.
ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాటును తాకుతాయి. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించిపోయారు.