తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ విభాగం వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం “టీఆర్ఎస్ మిషన్” పేరుతో లండన్లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో టీఆర్ఎస్-యూకే టీమ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యాలయం ద్వారా కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారని ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్-యూకే తన వంతు పాత్ర పోషించిందో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా ప్రచారం చేయబోతోందని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త తమ శక్తి మేరకు ప్రచారం చేసి, గత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పని చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, వైస్ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, సెక్రటరీలు సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, సంయుక్త కార్యదర్శులు సేరు సంజయ్, మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ, రమేష్ యేసంపల్లి, సురేష్ గోపతి, అధికార ప్రతినిధులు రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంఛార్జ్ నవీన్ భువనగిరి, భాస్కర్ మొట్ట, మీడియా ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, మెంబెర్షిప్ ఇంచార్జ్ అశోక్ కుమార్ అంతగిరి, ఈస్ట్ లండన్ ఇంఛార్జ్ ప్రశాంత్ కటికనేని, రీజినల్ కోఆర్డినేటర్ శివ కుమార్ (లీడ్స్), ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్ల పాల్గొన్నారు.