సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. భరత్ అనే నేను లాంటి భారీ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏప్రిల్ నెలాఖరున మహర్షి సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా… వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది.