తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది నిరుద్యోగులు (తెలుగు, ఆంగ్ల మాధ్యమం) డీఎస్సీ ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. తెలంగాణలో మెగా డీఎస్సీకి మెగా నోటిఫికేషన్ ఈవారంలోనే వెలువడనుందని ఇదివరకే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇప్పుడు దానిని కన్ఫమ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చేసింది. దాదాపు 8200 టీచర్ పోస్టులు రిక్రూట్ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేటి ఉదయం ప్రకటించారు.
టీచర్ ఉద్యోగార్థులకు పండగ చేసుకునే నోటిఫికేషన్ ఇది. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కల నెరవేర్చుకునేందుకు, గౌరవప్రదమైన జీతం అందుకునేందుకు వర్కింగ్ ప్రయివేట్ టీచర్లకు, నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్లకు ఇదో సదవకాశం. ఇంకా స్టడీ మొదలు పెట్టకపోతే అలెర్టవ్వాల్సిన టైమ్ ఇదే.