Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఉగ్రావాదులు దేశంలోకి చొరబడినట్లు నిఘా సంస్థల హెచ్చరికతో కేద్రం ప్రబుత్వం దేశమంతటా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని ప్రదేశాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసింది. ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని సీసీ కెమెరాలనుఅమర్చారు. అంతే కాకుండా కొన్ని కీలక ప్రాంతాల్లో అనుమానం ఉన్న ప్రదేశాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. అయితే ఇనార్బిట్ మాల్ ను ఉగ్రావాదులు టార్గెట్ చేశారని పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వీకెండ్ కావడంతో జనాలు ఐటి కారిడార్ లో రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లలో అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.