కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ `జాగ్వార్` సినిమాతో కథానాయకుడిగా పరిచమవుతున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఆ సినిమా సెప్టెంబరులోకానీ, అక్టోబరులోకానీ విడుదల కాబోతోంది. రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ అందించిన కథతో మహదేవ్ అనే ఓ తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమాలోని పాటలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఆడియో ఫంక్షన్ని హైదరాబాద్లో పెద్దయెత్తున జరపాలని కుమారస్వామి డిసైడయ్యాడు. ఆ మేరకు అతిథుల్ని కూడా పెద్దయెత్తున ఆహ్వానిస్తున్నాడు. పవన్కళ్యాణ్ని ఆహ్వానించేందుకు స్వయంగా హైదరాబాద్ వచ్చారు. పవన్ ఇంటికెళ్లి చాలాసేపు ఆయనతో మంతనాలు జరిపారు. సినిమాలతో పాటు, రాజకీయాలూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. కుమారస్వామి ఆహ్వానం మేరకు జాగ్వార్ ఆడియో పంక్షన్కి తాను హాజరవుతానని పవన్ చెప్పాడట.
కాగా త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో కుమారస్వామి పవన్ మద్దత్తు కోరడానికి వచ్చారనే అభిప్రాయలు వినబడుతున్నాయి.కర్ణాటకలో కూడా పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ పవన్ మద్దతు తెలిపితే ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని కుమారస్వామి ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం వీరి భేటీ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.