ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధుకు రివార్డ్ ల వెల్లువ కొనసాగుతోంది.తాజాగా సింధుకు రూ 5 కోట్ల నజరానాను తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్దిసేపత్రి క్రితమే ప్రకటించాడు. ఈసందర్భంగా కేసీఆర్ సింధుని అభినందించారు.తెలుగు జాతి గర్వపడేలా చేసిన సింధుని ప్రోత్సాహించడం అవసరమని అన్నారు.
సింధు కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సింధు కు దేశవ్యాప్తంగా ప్రశంసలే కాక రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డ్ ను కూడా ప్రకటిస్తున్నాయి.