కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, అటుకులు- పిడికెడు, కొబ్బరికోరు- అర కప్పు, ఈస్ట్- అర చెంచా, పటికబెల్లం పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- ఒక టేబుల్ స్పూన్
తయారీ: సామబియ్యాన్ని కడిగి ఐదు గంటల సేపు నానబెట్టాలి అరగ్లాసు వేడినీటిలో ఈస్ట్, పటికబెల్లం పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. అటుకులను ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులో కొబ్బరికోరు, ఈస్ట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి ఈ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని ఆరుగంటల సేపు కదిలించకుండా ఉంచాలి ఆపం పెనం వేసి చేసి అందులో ఒక గరిటెడు పిండి వేసి అర చెంచా నూనె వేసి మూత పెట్టి సన్నమంట మీద కాల్చాలి. అర నిమిషానికి ఆపం కాలి అంచుల దగ్గర పైకి లేస్తుంది. అప్పుడు తీసేయాలి. ఆపాన్ని తిరగేసి కాల్చరాదు. ఒకవైపే కాల్చాలి. దీనికి కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్.