Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చైనా యాపిల్గా పేరొందిన షియోమి కంపెనీ తన ఎంఐ4 ఫోన్ ధరను భారతీయ మార్కెట్లలో రూ. 2 వేలు తగ్గించింది. ఎంఐ4 16 జిబి వేరియంట్ ధర రూ. 19,999 ఉండగా.. దాన్ని రూ. 17,999కి తగ్గించారు. అలాగే 64 జిబి వేరియంట్ ధర రూ. 23,999 ఉండగా దాన్ని కూడా 2 వేలు తగ్గించి రూ. 21,999 చేశారు.

ఈ కొత్త ధరలు ఫ్లిప్కార్ట్తో పాటు మొబైల్ స్టోర్లో కూడా అమలవుతాయి. ఈ విషయాన్ని షియోమి ఇండియా అధినేత మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.