Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలీవుడ్ కండల వీరుడిగానే కాకుండా స్పీడ్ డాన్సర్ గా పేరుపొందిన హీరోగా పేరు సంపాదిచుకున్నాడు హృతిక్ రోషన్. ఇండియాకు ఫస్ట్ కామిక్స్ కథలతో క్రిష్ అనే సూపర్ మ్యాన్ గా అలరించి ప్రతి భాషలో హృతిక్ సుపరిచితుడయ్యాడు. సినిమా కెరీర్ పరంగా బానే ఉన్న ఈ కండల వీరుడు కొన్నేళ్ళనుండి పర్సనల్ లైఫ్ తో మాత్రం కొంత ఇబ్బందిగానే ఉన్నాడు. 2000 లో సుసాన్నె ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ ఆ తరువాత ఆమెతో విభేదాలు వచ్చి 2014 లో విడాకులు తీసుకున్నాడు. అప్పట్లో వీరి గొడవ బాలివుడ్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తరువాత ఒక్కసారి కూడా వీరు మళ్లీ కలుసుకోలేదు.

సాదారణంగా బాలీవుడ్ తారలు విడాకులు తీసుకున్న తరువాత కూడా ఒక్కోసారి ఎదురుపడినప్పుడు కరచలనం చేసుకుంటారు. కానీ హృతిక్ – సుసాన్నె ఖాన్ విడిపోయి 3 ఏళ్ళు కావొస్తున్నా ఇంత వరకు కలుసుకోలేదు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా ప్రముఖులు ఈ ఇద్దరిని పార్టీకి ఆహ్వానిస్తే ఎవరైనా ఒక్కరే హాజరయ్యేవారు. కానీ రీసెంట్ గా హీరో అక్షయ్ కుమార్ ఇన్వైట్ చేసిన ఓ పార్టీకి మాత్రం ఈ మాజీ దంపతులు ఇద్దరు హాజరు కావడం అందరిని షాక్ గురిచేసింది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ విషయంపై కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఎవ్వరు చేయలేని పనిని అక్షయ్ కుమార్ చేశాడంటూ..బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి అందరి స్టార్స్ లానే నార్మల్ గా మాట్లాడుకున్నారా లేదా మల్లి కలిసే ఆలోచనలో ఉన్నారా అనే ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి.