Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇప్పటికే మాలీవుడ్ హీరోయిన్లు అధిక సంఖ్యలో భర్తల నుంచి విడాకులు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సంస్కృతి ఇంకా కొనసాగుతోందనిపిస్తోంది. తాజాగా నటి దివ్యాఉన్ని తన భర్త నుంచి విడిపోయి విడాకులు పొందారు. తమిళంలో సుభాష్, కన్నన్ వరువాన్, పాలైయత్తు అమ్మన్, వేదం, ఆండాన్ అడిమై తదితర చిత్రాల్లో నటించిన నటి దివ్యాఉన్ని. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఈమె డాక్టర్ సధీర్‌శేఖర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని నటనకు దూరం అయ్యారు. అయితే వీరి వివాహ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు.

14 ఏళ్లు వివాహ జీవితం అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. భర్త నుంచి విడాకులు పొందిన నటి దివ్యాఉన్ని ఇప్పుడు స్వేచ్ఛా జీవి అయ్యారట. దీంతో పెళ్లి తరువాత ఆపిన నటనను మళ్లీ కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్న దివ్యాఉన్ని కొందరు దర్శకుల వద్ద కథలు వింటున్నారని సమాచారం.

తనకు తగ్గ కథ లభిస్తే నటిస్తానంటున్న ఈ మలయాళీ భామ చెల్లెలు విద్యాఉన్నికి కూడా నటనపై మోజు పెరిగిందట. ఆమెను హీరోయిన్‌ను చేసే పనిలో ఉన్నారు దివ్యాఉన్ని. పనిలో పనిగా తన చెల్లెలితో కలిసి నటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మంచి కథ కుదిరితే ఇద్దరం కలిసి నటించడానికి రెడీ అంటున్నారు.