Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వేనాడ్ (కేరళ) : కేరళ ప్రభుత్వంలో ఏకైక మహిళామంత్రిగా కొనసాగుతున్న పీకే జయలక్ష్మి రైతు సీఏ అనిల్‌కుమార్‌ను హిందూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు. కురిచియ సంప్రదాయ పద్ధ్దతిలో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మంత్రి జయలక్ష్మి మెడలో వరుడు అనిల్ కుమార్ మూడుమూళ్లు వేశారు. ఆ తర్వాత సీఎం ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మనంథవాడీ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన జయలక్ష్మి.. చాందీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ, యువజన సర్వీసుల మంత్రిగా సేవలందిస్తున్నారు.