Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన సభని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసభలో రాహుల్ గది ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు. ఈసభలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు జగ్గారెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి గట్టోడు .. మొండోడు. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు చేసి ఈ ఏర్పాట్లు చేశాడు అని రాహుల్ గాంధీ ముందు ప్రశంసించాడు. దీనికి రాహుల్ గాంధీ సరదాగా వ్యాఖ్యానించారు.

సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారు అని రాహుల్ విహెచ్ ని ప్రశ్నించారు. నా దగ్గరే ముంది ఇచ్చేందుకు అని విహెచ్ బదులిచ్చాడు.దీనిరాహుల్ సరదాగా మీ బ్రేస్ లెట్ ఉందిగా అని వ్యాఖ్యానించారు. దీనితో అక్కడున్న నేతలంతా నవ్వేవారు. రాహుల్ సరదాగా అన్న మాటలను విహెచ్ నిజం చేసి చూపించారు. విహెచ్ తన చేతికి ఉన్న బ్రేస్ లెట్ ని జగ్గారెడ్డి కి నేడు బహుమతిగా ఇచ్చారు.