Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కర్ణాటకు చెందిన బిజెపి ఎమ్మెల్యే తిప్పరాజు రాసలీలల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని రాయచూరు ఎమ్మెల్యే తిప్పరాజు బెంగుళూరు సమీపంలోని విశ్వనాధపుర పోలీస్ స్టేషన్ లోని మహిళా ఎస్ ఐ తో రాసలీలలు సాగించిన విషయం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎమ్మెల్యే భార్యకు తెలియడంతో ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తన భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉన్నట్లుగా కూడా ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మీడియాలో ఈ రకమైన వార్తలు వస్తున్నా అతని భార్య మాత్రం వాటిని ఖండించారు. తాను మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయలేదని తన భర్త అక్రమ సంభందం విషయం గురించి ఇంతవరకు తెలియదని ఆమె అన్నారు. తిప్పరాజు 2013 లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో మహిళా ఎస్ ఐ ని ఓ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలని హోమ్ మంత్రి ని కోరినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ టచ్ లో ఉంటున్నారని వారిమధ్య ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసిందని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే భార్య పిల్లలు ఇంటిలో లేని సమయంలో మహిళా ఎస్ ఐ వారి ఇంటికి వెళ్లేదని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.తనపై వస్తున్న ఆరోపణలపై మహిళా ఎస్ ఐ స్పందించారు. తనపై పుకార్లు పుట్టిస్తున్న వారితోనే తను స్వయంగా తేల్చుకుంటానని ఫైర్ అయ్యారు. తన రాజకీయ ఎదుగుదలని జీర్ణించుకోలేనివారే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే తిప్పరాజు అన్నారు.