Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అలనాటి హీరోయిన్ రాధిక రజిని కాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంగా మారిన ఈ వ్యాఖ్యల గురించి తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.స్థానికతకు సంబంధించి రాధిక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారని అలాంటి వారిని తమిళ ప్రజలు ఆదరించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఎంజీఆర్, జయలలిత, రజిని కాంత్, విజయ్ కాంత్ వంటి వారంతా స్థానికులు కాదని ఆమె అన్నారు.

సడెన్ గా రాధికా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో అని చర్చించుకుంటున్నారు. నడిఘర సంఘం నాయకులపై కూడా రాధికా విమర్శలు ఎక్కుపెట్టారు. హీరో విశాల్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడని ఆమె అన్నారు. కార్తీ, శివరామ్ వంటి నటులు తమిళులా అంటూ ప్రశ్నించారు. రాధిక వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. ఇటీవల నడిఘర సంఘంలో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.జయలలిత, రజిని కాంత్ వంటి వారు తమిళులే కాదని ఆమె వ్యాఖ్యానించడంతో దుమారం రేగుతోంది.