Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సూపర్ స్టార్ రజినీకాంత్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె రజినీకాంత్ ని కలిసారనే వార్తలు రాగానే.. వారి భేటీ ఎందుకు జరిగింది ? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అంటూ సందేహాలు మొదలయ్యాయి. మరికొందరు వారికి తోచిన రీతిలో దీనిపై పుకార్లు సృష్టించారు.

అమృత ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ మరాఠీ, బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడుతుంటారు. ఇప్పటి వరకు ఆమె అనేక చిత్రాల్లో పాటలు పాడారు. ప్రస్తుతం రజినీకాంత్ కాలా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాట పాడబోతోందని అందుకే రజినీకాంత్ తో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. కాగా ఆ వార్తలను అమృత ఖండించారు. రాను రజినీకాంత్ గారితో భేటీ అయిన సందర్భంలో సామజిక సమస్యలు వాటి పరిష్కారం గురించి చర్చ జరిగిందని తెలిపారు. రజినీకాంత్ వంటి లెజెండ్ ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నాని అమృత అన్నారు.