Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం దేశంలో జిఎస్‌టి అందరిలోనూ చర్చయినీయాంశంగా మారింది. అయితే ఈ విధానాన్ని సినిమాలపై కూడా ప్రయోగించనుంది ప్రభుత్వం. ఇప్పటికే టాక్స్ ల రూపంలో భారీ చిత్రాలకు పన్నులు విధిస్తున్న ప్రభూత్వం ఇప్పుడు టికెట్ల విషయంలో మరింత ఆదాయాన్ని ఆర్జించనుంది. ఈ సంచలనాత్మక నిర్ణయంతో మొదట అల్లు అర్జున్ డీజే సినిమా కలెక్షన్లకు బారి స్థాయిలో గండిపడనున్నట్లు తెలుస్తోంది.

100 రూపాయల టికెట్ల కు 28 శాతాన్ని ఫిక్స్ చేయగా అంతకంటే తక్కువ రేటు ఉన్న టికెట్ కు 18 శాతం ఖరారు చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా కు వచ్చే లాభాల్లో చాలా వరకు పన్నులకే పోనుందని తెలుస్తోంది. మరి ఈ విధానంతో బయ్యర్లకు కొంత నష్టాన్ని చూడక తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ నెల 23న రిలీజ్ అయ్యే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.