Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బి. గోపాల్ దర్శకత్వంలో గోపించంద్ హీరోగా తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ చిత్రంకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. తాండ్ర రమేష్ నిర్మాత గా వస్తున్నా ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ లోకి రావాల్సి వుంది. అయితే అనుకోని అవాంతరాల మధ్య శుక్రవారం కూడా మార్నింగ్ షో వాయిదా పడింది. మ్యాట్నీ నుంచి ఈ సినిమా మొదలుకానుందని తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదనే వార్త వినిపిస్తుంది. మరి ఇన్ని అవాంతరాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ చిత్రం శుక్రవారమైన థియేటర్స్ లోకి వస్తుందో, రాదో అనే విషయాన్ని చూడాలి.