Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణ రాష్ట్ర టిజేఏసి అధ్యక్షుడు మరియు ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రీసెంట్ గా హైద్రాబాద్ లో టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడూతూ.. ఎన్నో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతాయని అనుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయనాయకుల అండదండలతో కొందరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 10వేల ఎకరాలు భూ కుంభకోణంలో ఉన్నాయని కోదండరాం మండిపడ్డారు. అంతే కాకుండా కొంతమంది పాలకుల నేతల తమ అధికార దాహంతో ఇష్టారాజ్యంగా పాలనను కొనసాగిస్తున్నారు అంటూ.. మీకు అధికారం అప్పజెప్పింది రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అంతే కానీ ప్రజలనుండి భూములను దౌర్జన్యంగా రాయించుకోవడానికి కాదని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.